ఎల్లలు దాటుతున్న తెలంగాణా అక్షరం!

Memont Final1

ఎనిమిదేళ్ల కింద తెలంగాణా రచయితల వేదిక నాయకత్వం అగ్రకుల వాసనలున్న వారినుంచి బహుజన వాదుల చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ‘తెరవే’ దొరల నాయకత్వం ఊడిగం నుంచి అసలైన ప్రజల అస్తిత్వ ఉద్యమంలోకి ప్రవేశించింది.

గత 12 సంవత్సరాలుగా తెలంగాణా రచయితల వేదిక తెలంగాణా సంస్కృతి పరిరక్షణగా పనిచేస్తూ, తెరవే తన పరిధిని విస్తృతపరుచుకునే క్రమంలో రెండేళ్ళ క్రితం అఖిల భారత తెలంగాణ రచయితల వేదికను నిర్మాణం చేయడం జరిగింది. హిందీలోకి ‘ఉడాన్’ అనే కవితా సంకలనాన్ని ఆవిష్కరించింది. అయితే దేశ, విదేశాల్లో కవులు, రచయితల గురించి ఆరా తీయగా ముంబాయి, భీవండీ, షోలాపూర్, ఢిల్లీలలో కొందరు, విదేశాల్లో నామమాత్రంగా ఉన్నారు. ఇలా ఉండడానికి కారణాలను వెతుకగా తెలంగాణ ప్రాంతం నుంచి శ్రమాధారిత వలసలే ప్రధానంగా అకనిపించాయి. విదేశాల్లో కవులు, రచయితలు కొద్దిగా ఉన్నారు. తెలంగాణ నుంచి  మేధోపరమైన వలసలు గత దశాబ్దం నుండే జరుగుతుంఢడం వలన అని తేలిపోయింది.

ఇప్పుడు తెలంగాణ రచయితలు ఇక్కడి సాహిత్యం, సంస్కృతులపై ఆధిపత్య ప్రాంతం వారు చేసిన దాడిని మరింత తీవ్ర ఉద్యమంలోకి పరివర్తనం చెందేలా పని చేయాలి. ఇదే కాలంలో తెలుగు వాచకాల్లో,  చరిత్ర పుస్తకాల్లో,  తెలంగాణ ప్రజల చరిత్ర, భాషలను, సంస్కృతిని ప్రవేశపెట్టడానికి ఇంటి, బయటి బ్రాహ్మనీయ ఆధిపత్యవాద భావజాలంతో ఆచరణాత్మక లక్షల అక్షర యుద్ధానికి సన్నద్ధం అవుతుంది. ఈ దిశగా తెలంగాణ రచయీతల వేదిక తీవ్రంగా కృషి చేస్తూ పుస్తక ప్రచురణలను, వివిధ కార్యక్రమాలను, మహాసభలను, ధర్నాలను నిర్వహించింది. ఇకముందు నిర్వహిస్తుంది కూడా.

ఇకపోతే తెలంగాణ రాష్ట్రం విషయంలో కాంగ్రేస్ పార్టీ తన నిర్ణయం చెప్పింది. కానీ అది సమైక్యవాదం పేరుతో చేస్తున్న మీడియా ఉద్యమాన్ని కట్టడి చేయాల్సి ఉంది. కాబట్టి పది జిల్లాల (హైదరాబాద్)తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేయకపోతే 2014 ఎనికల్లో కాంగ్రేస్ నామరూపాలు లేకుండా పోతుంది. మెజార్టీ సీమాంధ్ర పెట్టుబడి రాజకీయ నాయకుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఏ చిన్న పొరపాటు  చేసినా దాని ఆయుష్షు మూడినట్టే. మొత్తం తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర నాయకులు ఎట్లయినా వ్యతిరేకులే కానీ తెలంగాణ రాజకీయ నాయకులే మొదటినుంచి పెద్ద ఇంటి దొంగలు. రాజకీయ పరిణామాలను, మోసాలను, కుట్రలను, దగాలను ఎప్పటీకపుడు తెరవే ఎత్తిచూపుతూ సృజనాత్మక ప్రక్రియలైన కవిత్వం, వ్యాసాల ద్వారా దునుమాడుతూనే ఉంది. తెలంగాణ సాయుధ పోరాట  వారసత్వాన్ని అందిపుచ్చుకోలేక యువకులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని తెరవే కీర్తించలేకపోతుంది. ఈ ఆత్మహత్యల శవాల మీది ప్యాలాలను ఏరుకొని బతుకీడుస్తున్న రాజకీయ నాయకులు, కొన్ని ప్రజాసంఘాలు పబ్బం గడుపుతున్న వైఖరులను  తెరవే ఆదినుంచి గర్హిస్తున్నది.

మొదటినుంచి తెరవే ఒక స్పష్టమైన ప్రణాలికా విధానాలతో అడుగులేస్తున్నది. తెలంగాణ వచ్చేదాక ఆధిప్రత్య ప్రాంతాల సాహిత్య, సంస్కృతులపై పోరాటం చేస్తుంది. అదేకాలంలో తెలంగాణ ప్రాంతం సాహిత్య సంస్కృతుల పునర్జీవనానికి కృషి చేస్తున్నది. తెలంగాణ వచ్చినంక బహుజన పక్షం వహించి ఈ ప్రాంతం సంపదలను దోచుకొని రాజకీయ ముసుగులో దోబూచులాడే అధికార నాయకత్వంతో తిరుగులేని పోరు సలుపుతుంది. ఆ దిక్కుగా నిరంతరం అక్షరాయుధాలను లక్ష్యంగా ఎక్కుపెడుతూనే ఉంటూంది.

 -జూకంటి జగన్నాధం

 

నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం

నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం

భాష, చరిత్ర నిర్మాణం మీద శ్రద్ధ పెరగాలి

వాస్తవానికి తెలంగాణా రచయితలు చేయవలసిన  కార్యక్రమాలు  మునుపటికన్నా ఎక్కువగా ఉన్నాయి. భాధ్యతలు కూడా ఎక్కువ. భాషా సంస్కృతి, సాహిత్య రంగాల్లో గతంలో జరిగినవన్నీ బేరీజు వేసుకోవాలి. ఆ పనిని భద్రపరచవలసిన అవసరం కూడా ఉన్నది. వర్తమానంలో తెలంగాణా భాషా సాహిత్యాలకు జరుగుతున్న వివక్ష ఇంకా ఎండకట్టాలె. అన్నమయ్యను పట్టించుకున్నంతగా రామదాసును పట్టించుకోలేదు. ఇక్కడి కోటి లింగాల ప్రాధాన్యాన్ని చరిత్ర పుస్తకాల్లోకి ఇంకా ఎక్కించలేదు.

ఇక భవిష్యత్ దర్శనం కూడా చాలా అవసరం. ముఖ్యంగా పత్రికల్లోనూ, సినిమాల్లోనూ, పాఠ్యపుస్తకాల్లోనూ, పాలన భాషగాను తెలంగాణా భాష ఎట్లా ఉండాలె అన్న అంశం పై చర్చ జరగాలి. సమగ్ర తెలంగాణా నిఘంటువు నిర్మాణం, సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం మొదలైన అంశాలు పట్టించుకోవాలె. ఇప్పుడున్న స్థితిలో తెలంగాణా వనరుల విధ్వంసం ఆపాలి. పాలకుర్తి సోమన నుంచి ఇప్పటివరకు కోనసాగుతున్న దేశీ కవితా సంప్రదాయాన్ని, జానపద సాహిత్య వారసత్వాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన భాద్యత తెలంగాణా కవులదే..

– నలిమెల భాస్కర్

——————————————————————

పోరాడే గొంతులకు సరిహద్దులు లేవు!

6730_1201798282421_6844587_n

తెలంగాణా దశాబ్దాల తన్లాట  ఒక కొలిక్కి వస్తున్నట్టున్న సందర్భంలో తెలంగాణా రచయితల భాద్యత మరింత పెరిగిందని భావిస్తూ , అఖిల భారత తెలంగాణా రచయితల వేదిక మరొక్క అడుగు ముందుకు వేసింది. వివిధ రాష్ట్రాలలో, ప్రాంతాలలో స్థిరపడి,    తెలంగాణా సంస్కృతీ, సంప్రదాయాలని , చరిత్రని, సాహిత్యాన్ని నలుమూలల  తమ రచనల ద్వారా చాటుతున్నఅఖిల భారత ప్రవాస రచయితలను ఒక్క తాటికి తీసుకు వచ్చి తెలంగాణా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయ తలచినది.

ఈ నెల 22న , కరీంనగర్ లో అఖిల భారత రచయితల వేదిక మహాసభలలో భారత దేశం లోని ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణా రచయితలు వచ్చి తమ రచనలను , భావాలను తెలంగాణలో పంచుకోనున్నారు . ఈ మధ్య కాలంలో   తెలంగాణా ఉద్యమ క్రమంలో వచ్చిన కొన్ని కవితలని ‘ఉడాన్’ అనే పేరుతొ హిందీలోకి అనువదించిన పుసకాన్ని ఆవిష్కరించనున్నారు . అట్లానే గాగోజు, అన్నవరం, బూర్ల వెంకటేశ్వర్లు, పెద్దింటి అశోక్ కుమార్   ఇతర రచయితల పుస్తకాలను , సీడీ ల  ఆవిష్కరణ లు ఉంటాయి.

తెలంగాణా మలిదశ ఉద్యమం లో ప్రతినిత్యం ప్రజలతో కలిసి  స్థానిక పోరాటాలలో భాగస్వామ్యం అవుతూ,  తమ రచనల ద్వారా అనేక అంశాలని ప్రజలోకి విస్తృతంగా తీసుకు వచ్చింది తె.ర.వే. అందులో ముఖ్యంగా గల్ఫ్ బాదితుల గాధలు , గ్రానైట్ మైనింగ్ ఇతర వనరుల విద్వంసం  ద్వారా జరుగుతున్న జన, ప్రాణ, నష్టాలు , కోల్పోతున్న  చారిత్రిక కట్టడాల పరిరక్షణ, ఇంకా అనేక రూపాలలో తెలంగాణా భావ వ్యాప్తికి  పది జిల్లాలలో  నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

విద్యార్ధులను, ఉద్యోగస్తులను, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను ఒక్క తాటిపైకి తెచ్చి అనేకులకు సామాజిక భాద్యత స్పృహను కల్పిస్తున్నారు తెరవే రచయితలు.   తెలంగాణా పునర్నిర్మాణ క్రమం లో,  తెరవే, అభారవే త్వరలో ఏర్పడబోయే అంతర్జాతీయ తెలంగాణా  రచయితల  వేదిక లు ఈ ప్రాంతం  గొప్ప చారిత్రకతని నలుదిశల   వ్యాప్తి చేసేటట్టు, స్వేచ్చా , సమానత్వపు పునాదుల మీద  ఈ ప్రాంతం  నిలబడి  హక్కుల కోసం పోరాడే గొంతుగా రచయితలు తమ అక్షర ఆయుధాలను సంధించేటట్టుగా  ఈ కార్యక్రమం రూపు దిద్దుకుంటుంది.

తెలంగాణా ప్రకటన రాగానే దోపిడీ, పెట్టుబడి దారుల అండతో  సీమ, ఆంధ్రా లో   మొదలైన ఒక బూటకపు సమైక్య ఆరాటం తోని , కేంద్రం జాప్యం తోని ఒకింత అసహనానికి , అధైర్యానికి గురైతున్న తెలంగాణా ప్రజలకి , నిరాశతో ప్రాణాలు కోల్పోతున్న యువతకి మళ్ళి ఉద్యమ చైతన్యాన్ని నింపి , ప్రజలతో కలిసి ప్రజలతో కలిసి ఉద్యమించడానికి ‘అతెరవే’ పిలుపునిస్తుంది. హైదరబాద్ మీద డేగ  కన్ను వేసి, మత విద్వేషాలని రగిల్చి, హింసను ప్రేరేపించి నయాన్నొ భయాన్నొ తెలంగాణా ని అడ్డుకుందామని చూస్తున్న సీమ , అంధ్రా నాయకుల కుట్రలను తిప్పికొట్టి తమ రచనల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడూ  అప్రమత్తం చేస్తూ ఉండే బాద్యతను నిరంతరం చేపడుతుంది రచయితల వేదిక.    దానికి కలిసి, దేశ,  ఖండాంతరాలలో ఉండి నిరంతరం తెలంగాణా కొరకు ఆరాట పడే మిత్రులకు ఇదే మా ఉద్యమ ఆహ్వానం .

 సుజాత సూరేపల్లి

రాష్ట్ర కార్యదర్శి , తెరవే .

1208945_528882817180842_314503988_n 

                 ———————————————————————–

 ఆంధ్ర మూసనుంచిబయటపడాలే!

536547_314947875241005_1061780088_n

ముందుగా అరవై ఏండ్ల కింద మాయమైన తెలంగాణా భాష ను తిరిగి చిగురింప చేసుకోవాలే. ఇప్పుడు కవులు, రచయితలు చేయాల్సిన పని ఇదే.

తెలుగు జాతి పేరిట ఒక్కటై తెలంగాణా సంస్కృతి ని సత్తే నాశనం చేసిండ్రు.  ఎన్నో ఉద్యమాల పలితంగా దళిత బహుజనులు ఆదివాసీలు అస్తిత్వ  చైతన్యం పొందుతున్న తరుణంలో తెలంగాణా ఉద్యమంలో దోపిడీ,  అగ్ర కులశక్తులు సహజంగానే ప్రవేశించాయి  రానున్న రోజుల్లో వీళ్లతోనే మల్లా షమ ఉండే ఉంటది. ఇక్కడి వనరుల విద్వంసం జరిగింది. వందలాది, వేలాది గుట్టలను గ్రైనేట్ పేర దోసుకొని పోతాండ్రు. వాళ్లకు తెలంగాణా రాజకీయ నాయకులు అండగా ఉంటాండ్రు ,

ఇప్పుడు తెలంగాణా పాఠ్యపుస్తకాలు , చరిత్ర పుస్తకాలు మార్చుకోవాలె. కవులు, రచయితలు ఆంధ్ర మూస ,ఆంధ్ర ప్రమాణాలతో సాహిత్యాన్ని బేరీజు వేస్తున్నారు. అది పోయి తెలంగాణా ప్రమాణాలు నిలువాలే. అరవై ఏండ్ల సీమాంద్ర పాలన వల్ల తెలంగాణా సమాజం చెప్పరానంత నష్టపోయింది . దానిని తిరిగి నిర్మించే ఉద్యేశ్యంతో ఈ సభలు నిర్వహిస్తున్నాం.

-అన్నవరం దేవేందర్

 1238254_515385905211021_339088778_n

Download PDF

7 Comments

  • i j swamy says:

    కందము
    ఎల్లలు దాటకు కవితా
    కల్లోలంబగును మీవి కవితలు సుమ్మీ
    ఇల్లంత చక్క బెట్టుము
    చెల్లవు నీ బ్రహ్మద్వేషచేస్టలుచెలియా
    ఆటవెలది
    ఎల్లలేలదాటుతల్లితెలంగాణ
    పల్లె లోన పడచు పదము పాడ
    బ్రహ్మ ద్వేష మేలబహుజన కవులార
    ద్వేష రహిత మైన పుడమి మనది

  • vijayabhaskar says:

    తెలంగాణా ఉద్యమ సాహిత్యం ఇప్పటి వరకు కుల సంస్కృతి అలవార్చుకోలేదు. దొరలకు ఎవరు ఉడిగం చేస్తున్నారో ప్రజలకందరికి తెలుసు. నిబద్దత అన్ని కులాల సొంతం. తెలంగాణా ఉద్యమ సాహిత్యం సృష్టిస్తున్న వాళ్ళు అగ్ర కులాలల్లో పుట్టినంత మాత్రాన శీల పరీక్షా చేయించుకోవాల్సిన పని లేదు.

  • అట్టడుగున అణగారి ఉన్న ప్రజల జీవితాల్లోంచి, ప్రాంతాల్లోంచి వచ్చే రచనలు ప్రోత్సహిస్తూ తెరవే చేస్తున్న కృషికి అభినందనలు.

  • Terave..తెలంగాణా…p

  • balasudhakarmouli says:

    తెలంగాణ వచ్చినంక బహుజన పక్షం వహించి ఈ ప్రాంతం సంపదలను దోచుకొని రాజకీయ ముసుగులో దోబూచులాడే అధికార నాయకత్వంతో తిరుగులేని పోరు సలుపుతుంది. ఆ దిక్కుగా నిరంతరం అక్షరాయుధాలను లక్ష్యంగా ఎక్కుపెడుతూనే ఉంటూంది.” – అల్ ది best

  • Galuh says:

    This is the ideal answer. Evrenoye should read this

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)