29 న ప్రముఖ కథా రచయిత్రి శారద “ నీలాంబరి” కథల పుస్తకం ఆవిష్కరణ

ప్రముఖ కథా రచయిత్రి, అనువాదకురాలు శారద కథల పుస్తకం “ నీలాంబరి” ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 29 న ఆస్ట్రేలియా లోని అడిలైడ్ లో జరుగుతుంది. గత  ఏడెనిమిదేళ్ళుగా కథలు రాస్తున్న శారద ఇప్పటివరకు 40 కి పైగా కథలు రాసారు.  అనేక అనువాద రచనలు చేసారు. ప్రతి కథ లోనూ తనదైన ఒక  ప్రత్యేక కోణాన్ని ఆవిష్కరించగలిగిన మంచి రచయిత్రి శారద. ఆమె కొత్త కథల పుస్తకం “ నీలాంబరి” కినిగె లో ebook గా కూడా లభ్యమవుతుంది. ఈ పుస్తకం లో ఆమె రాసిన 18 కథలున్నాయి.

” ఒకే రచయిత రాసిన కథల్లో వైవిద్యం వస్తువు లో, శైలి లో, శిల్పం లో , పాత్ర చిత్రణ లో, భాష లో, సందర్భాలలో , సంఘర్షణలలో, మనస్తత్వ చిత్రణ లో కనిపిస్తాయి. ఆ ఒక్క రచయిత యొక్క అనుభవాలు గానీ, తన చుట్టూ ఉన్న సమాజం లో గమనించిన విశేషాలూ , సంఘర్షణలూ ఉంటాయి. శారద కథల్లో ఈ వైవిధ్యం చూస్తాము. ఈ కథల్లో హాస్యం ఉంది. వ్యంగం ఉంది. సమాజం లో జరిగే ఆకృత్యాల మీద వ్యాఖ్యానం ఉంది. మనస్తత్వ చిత్రణ ఉంది. ” అంటారు నిడదవోలు  మాలతి శారద కథల పుస్తకం “నీలాంబరి” కి రాసిన ముందు మాట లో.

 

 

Download PDF

1 Comment

  • అభినందనలు. క్లిష్టమైన సమస్యలమీద సున్నితమైన రచన చెయ్యగల నేర్పు శారద రచనల్లో కనిపిస్తుంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)