ఈ కార్పొరేట్ నేల మీద ఖదీర్ “డాక్టర్” గారు ఎవరి డాక్టర్?!

khadeer babu

( ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవండి )

( రెండో భాగం )

khadeer book

మొదటిగా రచన ప్రయోజనం చూద్దాం. ఈ రచనకి పూనుకొన్నప్పుడు రచయిత ఆశించిన ప్రయోజనం ఏమిటి? సంపాదన వేటలో మనుషులు ఒత్తిళ్లకి లోనవుతున్నారనీ, అందువల్ల పిల్లలు సమాజానికి దూరమైపోతున్నారనే. దీనికి విరుగుడుగా రచయిత సూచించినది పిల్లల్ని కొంత ప్రజా జీవితానికి దగ్గరగా పెంచాలని. కానీ ఈ ప్రయోజనాన్ని ఈ కథ సాధించిందనీ, ఈ సందేశాన్ని బలంగా వినిపించగలిగిందనీ చెప్పలేం. కథని “రసవత్తరంగా” చెప్పాలనే ఉత్సాహమూ, రహస్య ఆకాంక్షలూ కథ ప్రయోజనాన్ని సున్నా చుట్టేశాయి. డాక్టరుగారి ప్రవర్తన వర్ణనా, నైటీలూ, పెదవులూ, ఆకర్షణా, కిసుక్కుమని నవ్వడాలూ, తనలో తనే మురిసిపోవడాలూ, వగైరాలకీ కథ నడకకీ ఏమీ సంబంధం లేదు. “ఏదో” “ఏదో” జరగబోతోందన్న ఉత్కంఠని పాఠకుల్లో లేవనెత్తి కథని చదివించే ప్రయత్నం కథ ప్రయోజనానికి సరిపడదు. ఇదంతా కథని “రసవత్తరంగా”నడిపి చివరికి కథారచన రచయిత ప్రతిష్టలో భాగమైపోతుంది. సంపాదన వేటకి ఫలితం ఒత్తిళ్లు అని గుర్తించిన కధ ఆ సంపాదన వేటకి మూలాల్ని గుర్తించలేక పోయింది. ఉత్పత్తి విధానం పెట్టుబడిదారీ విధానం కావడంతో ప్రజల ఆరోగ్యం కూడా “సరుకు”గా మారి వ్యాపార సూత్రాలకు లోబడి పోటీ, లాభం అనే అంశాలు మానవ జీవితాలకు నిర్ణాయక శక్తులుగా వున్నాయనీ కథ స్పష్టం చెయ్యగలిగి వుంటే ఆశించిన ప్రయోజనం నెరవేరేది. శ్రామికుల జీతాల్నీ, పని గంటల్నీ పోటీ నిర్ణయిస్తుందన్న మార్క్స్ వాక్యం (Pre -Capital formation అన్న నోట్సులో) ఒక్కటి చాలు కథని ప్రయోజనా పూర్వకంగా మలచడానికి. ఒక రచయిత తాను చూసిన విషయాన్ని కథగా రాసే ముందు చెయ్యవలసిన అధ్యయనం ప్రాముఖ్యాన్నీ, ఆ అధ్యయనం లేకపోతే కలిగే అనర్ధాన్నీ చెప్పటానికే ఇదంతా రాసాను. మనం చూసిందే రాయాలంటే సాహిత్యం అవసరం. ప్రయోజనం పెద్దగా వుండదు. మనం చూసిన విషయాలు అందరూ చూస్తున్నారు. కొందరు రోజూ చూస్తున్నారు. సమస్య ఏంటంటే చూస్తున్న దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఏం తెలుసుకోవాలి అనేదే.. ఆ సమస్యే సాహిత్య ప్రయోజనం. వాస్తవానికీ, వాస్తవికతకీ వున్న తేడా అదే. కనిపించింది చెప్పేవాడు వ్యాఖ్యాత. కనిపించనిది విప్పి చెప్పేవాడు రచయిత.

ఇంతకీ డాక్టరుగారి కష్టాలకి కారణాలేమిటి? అని ప్రశ్నించుకోవడం అవసరం.

కత్తి, కొడవలి, గొడ్డలి, గునపం రూపంలో వ్యవసాయంలో ప్రవేశించిన పెట్టుబడి వుత్పత్తిని పెంచి “మిగులు”ని తయారు చేసి వినిమయం, మారకం లేదా అమ్మకం, కొనుగోలు రూపంలో బజారుని తయారు చేసిన తర్వాత అది అక్కడితో ఆగదు. ఈ మిగులు బ్రహ్మరాక్షసి. దాని పెరుగుదలకి ఒక క్రమం, ఒక విధానం, ఒక పద్ధతి వున్నాయి. ఆ వివరాల్లోకి ప్రస్తుతం వెళ్ళకుండా అవసరం మేరకే మాట్లాడితే పెట్టుబడిదారీ తను పెరిగే క్రమంలో ఒక రకపు శ్రమ విభజనను ప్రవేశ పెడ్తుంది. అదే సమయంలో అది “నైపుణ్యాలకి” పెద్ద పీట వేసి కీర్తనలు పాడి, ఆ నైపుణ్యాలని “సరుకు”గా మార్చి, క్రమంగా మింగేస్తుంది.

వైద్యంలో దీన్ని చూస్తే డాక్టరుగారి తండ్రిలాంటి పరిమిత పరిజ్ఞానం గలవాళ్లు ఒక దశలో సరిపోతారు. వీళ్లు తమ బతుకుతెరువుకోసం ఒక మంగలి, ఒక చాకలి, కంసాలి, వడ్రంగి  వగైరా చేతి వృత్తుల వాళ్లలాగ గ్రామం మీద, సమాజం మీద ఆధారపడతారు. ఈ పరస్పర సహకారం ఇద్దరికీ అవసరంగా వుంటుంది. మార్కెట్ విస్తరించేకొద్దీ నైపుణ్యాలూ, శ్రమ విభజన పెరుగుతుంది. వైద్యంలో రకరకాల స్పెషలిస్టుల రాక ఇదే. ఆరోగ్యం అనే వుత్పత్తిని చెవుల,గుండెగా, ప్రసవంగా, ఎముకలుగా, వూపిరి తిత్తులుగా విడగొట్టి దానిలోని నిపుణుల్ని తయారు చేసింది. వ్యవసాయంలో నాగలి స్థానంలో ట్రాక్టరు వచ్చినట్టుగానే వైద్యంలోనూ రకరకాల యంత్రాలు రంగప్రవేశం చేసాయి. స్టెతస్కోపు, ధర్మామీటరుతో ఆగకుండా రకరకాల స్కానింగ్ మిషన్లు, మనిషి “చర్మం వొలిచి” లోపల ఏం వుందో చూపే యంత్రాలు వచ్చాయి. అయితే ఈ యంత్రాలు వుత్పత్తిదారుల చేతుల్లో వుండవు. డాక్టర్లూ, కంపౌండర్లూ,నర్సులూ.. వీటిని కొనలేరు.

ఈ పద్ధతిలో వ్యవసాయంలో భూమికి యజమానిగా వున్న రైతు అది పోగొట్టుకుంటాడు. వృత్తికారులు, చేనేత కావచ్చు. జాలర్లు కావచ్చు. తమ పనిముట్లు పనికిమాలి పోయాయని గుర్తించేలోపు రెండు చేతులు తప్ప ఏమీలేని కూలీలుగా మిగులుతారు. వ్యవసాయ కూలీలు, చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, వైద్యుడు ఎవరైనా ఒక్కటే. వ్యక్తిగత యజమానిగా, ఒక చిన్న రైతులాగ, సొంత కార్ఖానా పెట్టుకున్న వడ్రంగి, కమ్మరిలాగా, వున్న మంగలి డాక్టరుగారి  తర్వాత దశ వ్యక్తిగత నైపుణ్యం వున్న డాక్టరుగారే. స్పెషలిస్టులే. అలాగే రైతులు, వృత్తికారులూ, కూలీలైపోయి గ్రామాన్ని, చిన్న సమాజాన్ని వదిలేసి పట్నం చేరినట్లే డాక్టరుగారూ చేరారు. ఆ మేరకు రైతుల పట్ల వుండే సాధారణ సానుభూతి వైద్యుల పట్లా నాకు వున్నది.

కానీ, మంగలి డాక్టరుగారిలాగ సొంత డిస్పెన్సరీ నడుపుకునే దశనుంచీ కార్పోరేట్ ఆసుపత్రుల్లో కూలీలుగా మారిపోయే దశలోనూ, ఆ తర్వాతా ఈ వైద్యులు ఎవరివైపు నిలబడ్డారు? అన్నది నా సానుభూతికి గీటురాయిగా నిలుస్తుంది.

కారణాలేమైనా, మన దేశంవరకూ తీసుకుంటే ప్రభుత్వం వైద్యాన్ని ఒక కంటి తుడుపుగానైనా నిర్వహిస్తున్నది. గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలున్నారు. రోగాలు ఎక్కువగా గ్రామాల్లోనే వున్నాయి. మలేరియా, డయేరియాల్లా చిన్న చిన్న రోగాలకే చచ్చిపోతున్నవారి సంఖ్య తక్కువగా ఏమీ లేదు. ప్రభుత్వం ప్రకటించిన గ్రామాలు ఆర్ధిక గణాంకాలు(Rural Health Statistics) ప్రకారం చూస్తే మార్చి 2012 నాటికి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) 4 శాతం వాటిల్లో డాక్టర్లు లేరు. 36 శాతం వాటిల్లో లాబ్ టెక్నిషియన్లు లేరు. 23 శాతం వాటిల్లో మందులిచ్చే ఫార్మసిస్టు లేడు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సర్జన్లలో 75 శాతం, ప్రసూతి డాక్టర్లలో 65 శాతం, చిన్న పిల్లల డాక్టర్లలో 80 శాతం, సాధారణ ఫిజిషియన్లలో 80 శాతం కొరత వున్నది. మొత్తంగా చూస్తే అవసరమైన దాంట్లో కేవలం ముప్పై శాతం మాత్రమే వున్నారు. ప్రభుత్వం సాంక్షన్ చేసిన పోస్టుల్లో 52 శాతం సర్జన్ల పోస్టులూ, 40 శాతం ప్రసూతి డాక్టర్లూ, 53శాతం ఫిజిషియన్లూ, 43 శాతం చిన్న పిల్లల డాక్టర్ల పోష్టులు  ఖాళీగా వున్నాయి. మొత్తంగా చూస్తే శాంక్షన్ అయిన పోష్టుల్లో  43 శాతం పోష్టులు ఖాళీగా వున్నాయి.

వివరాలూ, గణాంకాలూ కావాలంటే టన్నులకొద్దీ ఇవ్వచ్చు కానీ మామూలుగా చూసినా గ్రామాల్లో వైద్యం లేదనీ, చిన్నరోగాలకి కూడా పనులు మానుకుని, కూలీ మానుకుని పట్టణాలకి పరిగెత్తి ఆసుపత్రుల వరండాల్లో గంటలగ్గంటలు పడిగాపులు పడాలని అందరికీ తెలిసిందే. గ్రామాల్లో రెండేళ్ళు పని చెయ్యాలన్న నిర్బంధం పెట్టినా డాక్టర్లు గ్రామాలకి రావడం లేదని ప్రకటించి, ప్రచారం చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటున్నది. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎటు పోతున్నారు?

ఉత్పత్తి సాధనాలు చేతిలో వుంచుకొని శ్రమని దోపిడీ చేస్తూ వుండే పెట్టుబడిదారుల వైపే ఉన్నారు. డాక్టరుగారు స్పష్టంగా చెప్పినట్టు సాఫిస్టికేటెడ్‌గా మోసం, వంచన చేస్తున్నవారి వైపే వున్నారు. “పేదల కారాగారం”లో వీరు పేదల వైపు లేరు. అందుకే నాకు వారిపై ఏమీ సానుభూతి లేదు. అన్నదాత, మహా పతివ్రత, వైద్యోనారాయణోహరీ లాంటి బిరుదుల వెంక వున్న అసలు ఉద్దేశ్యాల్ని గ్రహించగలిగిన వాళ్లు డాక్టరు పాత్రపై ఏమీ సానుభూతి  చూపించలేరు. మరో విషయం చూస్తే మరిన్ని యంత్రాలు ప్రవేశ పెట్టడం ద్వారా, ఎంతోమంది శ్రామికుల్ని బతుకుతెరువు నుంచి దూరం చేస్తోందనీ, అలా నిరుద్యోగులైపోయిన శ్రామికులు “పారిశ్రామిక సైన్యం”గా తయారై కూలీ మరింత తగ్గిపోవడానికీ, శ్రామికుల బతుకు మరింత దిగజారిపోవడానికీ కారణంవుతారనీ సిద్ధాంతం. కావలసినవాళ్లు సుళువుగా తెలియాలంటే మార్క్సు రాసుకున్న pre-capitalist economic formulate రాతలో చూడొచ్చు. ఆయన గ్రంధం కాపిటల్‌లో చదవొచ్చు.

ఇంతకీ ఈ క్రమంలో “పారిశ్రామిక సైన్యం” ఎవరని ఆలోచించాలి. మంగలి డాక్టరిలాగ, చిన్న రైతులాగ స్వంత యజమానులుగా ఉన్నప్పుడు వాళ్లతో కలిసి సమాజం మీద ఆధారపడి బతికే కొంతమంది ఉంటారు. వాళ్లు రైతు కూలీలు కావచ్చు. కథలోంచి చూస్తే కంపౌండర్లు, మందులిచ్చే ఫార్మసిస్టు, మంత్రసానిలాంటి నర్సు, ఆసుపత్రి శుభ్రం చేసే మనుషులు.. ఇలా  కనీసం ముగ్గురు నలుగురుంటారు. అది కొంచెం పెద్దది అయ్యి ఆసుపత్రిగా మారితే ఇంకొంచెం ఎక్కువమంది వుంటారు. వైద్యం నగరీకరణ అయ్యి, కేంద్రీకృతం అయిపోయిన  క్రమంలో వీళ్లంతా నిరుద్యోగులై పోయారు. ప్రభుత్వ రంగంలో చూస్తే ఇందాక మనం చెప్పుకున్న అంకెలు కేవలం డాక్టర్లకీ, కంపౌండర్లు, నర్సులు వగైరాల విషయంలో ఇవి చాలా దారుణంగా వున్నాయి.

ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయం ప్రకారం ప్రతి PHCలోనూ, డాక్టరు కాక పద్నాలుగుమంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నలుగురు డాక్టర్లు కాక ఇరవై ఒక్క మంది సిబ్బంది ఉండాలి. వాస్తవంలో వీటిలో ఒకరిద్దరు కూడా ఉండరు. అంటే సిబ్బంది కొరత ఏ స్థాయిలో వున్నదో ఆలొచించుకోవచ్చు. డాక్టర్లు లేరనే సాకు చూపించి సిబ్బందిని నియోగించకుండా చేతులు దులిపేసుకుంటున్న ప్రభుత్వం ఎంత నిరుద్యోగం పెంచుతోంది? పారిశ్రామిక సైన్యం ఎంత పెరిగింది? దయచేసి వెతకండి. కథలో డాక్టరుగారికి వీరిపట్ల ఏ బాధ్యతా లేదు. వైద్యం “నోబెల్ ప్రొఫెషన్”గా ఇంక ఎంత మాత్రమూ లేదన్న బాధే తప్ప కనీసం తన చుట్టూ వున్న వాళ్లెలా వున్నారన్న స్పృహ లేదు. వెయ్యి చిన్న క్లినిక్‌లని మింగి, ఏనుగులా నిలబడ్డ కార్పొరేట్ ఆసుపత్రి, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ పేరుతో వేలాదిమంది శ్రామికుల స్థానంలో యంత్రాల్ని, నలుగురు సిబ్బందినీ వుంచి తమ గుత్తాధిపత్యం వల్ల ధరలు విపరీతంగా పెంచి, మోసం, వంచన చేసి పేదల రక్తం పీలుస్తూ వుంటే డాక్టరు గారి వ్యక్తిగత దుఃఖాల పట్ల, ఆవిడ కొడుకు మొక్కలు పెంచుకోవడం పట్ల నాకేం సానుభూతి లేదు.

అయితే డాక్టర్లందరూ మనకి పనికి రాని వాళ్ళేనా? వాళ్లకీ మనకీ ఏం సంబంధం లేదా? అని ప్రశ్నించుకుంటే… వుత్పత్తిదారుడు (కథ విషయంలో డాక్టర్లు, కంపౌండర్లూ, నర్సులూ) వుత్పత్తి (కథలో ప్రజల ఆరోగ్యం) నుంచి వేరు పడే క్రమంలో వాస్తవానికి, డాక్టర్లు ఒక రకంగా పెటీ బూర్జువా (మధ్యవర్తులు)ల్లాంటివాళ్లు. పెట్టుబడి  పెరిగి పెరిగి గుత్త సంస్థలుగా మారే క్రమంలో (క్లినిక్ – నర్సింగ్ హోం – ఆసుపత్రి -మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్) ఈ పెటీ బూర్జువాలు నిస్సహాయులనీ అంటాడు ఒకాయన తన రాజ్యమూ -విప్లవమూ అనే  పుస్తకంలో. పెట్టుబడికి ఎదురొడ్డి పోరాడేది కార్మికులేనని స్పష్టం చేస్తాడు. మరి ఏ డాక్టర్లని మనం ఈ రకపు నిస్సహాయుల జాబితాలొ వేద్దాం. రకరకాల కారణాల వల్ల గ్రామాల్లో తమ ప్రాక్టీసు చేసుకుంటూనో, ప్రభుత్వ డాక్టర్లుగా పని చేస్తూనో వున్న వాళ్లని ఈ జాబితాలో వేస్తాం. అది బాగా ఉదారవాదమైనప్పటికీ ప్రస్తుతానికి ఉన్న స్థితిలో వీళ్లపట్ల మనం కొంత సానుభూతితో వుంటాం.

తమ సంపాదనని కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే డాక్టర్లని మనం గౌరవిస్తాం.

తప్పనిసరిగా, ఒక కొట్నీస్‌నో, ఒక రామనాధాన్నో అలాటి వాళ్లనో భుజాలకెత్తుకుంటాం.

విషయమేమిటంటే.

పోష్ కాలనీలో త్రీ బెడ్‌రూమ్  ఫ్లాట్‌లో వుండేవాళ్లని నేలమీద వుండే ప్రజలు కలుపుకుంటారా అని?

పెట్టుబడికి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడేది శ్రామిక వర్గమే కాబట్టి, అది తప్పనిసరి కాబట్టి.. ఆ శ్రామిక ప్రజలు తమ నేల మీదకి ఎవర్ని రానిస్తారు? ఎవర్ని కలుపుకుంటారు? అన్నది. తమను గురించి  పట్టించుకోని వాళ్లని వాళ్లెందుకు తమలో కలుపుకోవాలి? ఈ పెటీ బూర్జువాల ఖాళీ సమయాల్లో వాళ్లకి ఒక రిలాక్సేషన్ సోర్స్‌గా తామెందుకు వుండాలి? అనుకోవచ్చు.

ఇంతకీ ఈ కథ ఇలా ఎందుకు తయారైంది? అనేది దృక్పధాల సమస్య మాట్లాడుకుందాం. కొంచెం ఆగండి.

కథ చెప్పిన విధానాన్ని చూస్తే శిల్పంగా పిలవబడేది స్థిరము కాదు. జఢము కాదు. తీరుబాటు సమాజంలో సాహిత్యానికి వర్తించే సూత్రాలు ప్రతి క్షణమూ పెట్టుబడికి యంత్రభూతముల కోరలు తోమే సమాజంలో ఎంత మాత్రమూ నప్పవు. సమయం తక్కువైన సమాజంలో డాక్టరుగారి జీవితం నుంచి చూసినా సరే, ఏ విషయమైనా క్లుప్తంగా చెప్పడం తప్పనిసరి అవుతుంది. నలభై పేజీల కథ ఆ మేరకి ఏం సాధిస్తుందన్నది ప్రశ్నార్ధకమే. నాలుగు తరాల జీవిత చరిత్ర వివరంగా విస్తరించుకొన్నప్పటికీ పాఠకుడికి కొత్తగా అందిన తెలివిడి ఏమీ వుండదు. చిన్న కథలో రాయబడ్డ ప్రతీ వాక్యమూ మరో వాక్యానికీ, మరీ ముఖ్యంగా కథాంశంగా పిలవబడే ప్రధాన విషయానికి పెనవేసుకుని పొవాలి. కేంద్రాన్ని బలపరిచేదిగా వుండాలి. కథలో ఈ అంశం ఎంత మాత్రమూ కనబడదు. ప్రజల(జీవితం)తో సంబంధం పోగొట్టుకున్న మనవడి ముత్తాతకీ, తాతకీ ప్రజలతో సంబంధం లేదా? తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత సంబంధం తోటే వున్నారే! మరి ఆ జీవితాలన్నీ అంత వివరంగా ప్రస్తావించడం ఎందుకు? అదేం కాదు. ముత్తాత సంగీతము, తాత మొక్కల పెంపకం ఇలా కేవలం విశ్రాంతి అనేదే ప్రధాన విషయం. అంటే కథ నేలమీద కాకుండా పూర్తిగా గాలిలో పుట్టినట్టే. ఫ్యూడల్ సంస్కృతిలోముత్తాత, పెత్తందారీ సంస్కృతిలో తాత ఎంతో విశ్రాంతిగా బతికారనుకోవడం, కలలూ, ఆనందాలూ ఆస్వాదించారనీ రాయడం వాస్తవానికి ఎంత దగ్గరగా వున్నది? పైగా కథకి అక్షరాలుగా చెప్పబడే ఏకసూత్రత, అనుభూతి ఐక్యత ఎలా సాధించినట్టు? చదువుతున్నంత సేపూ పరస్పర విరుద్ధ భావాల్ని కలుగచేసే కథ శిల్పం పరంగా వుత్తమంగా వుందని అనలేం.

మూడవ భాగం

 

ఇంతకీ ఈ కథ ఎందుకిలా తయారైంది అని మనం ప్రశ్నించుకొంటే, చాలా మాట్లాడుకోవాలి గానీ క్లుప్తత కోసం మూడు విషయాలకి పరిమితం అవుదాం.

మొదటిగా రచన ప్రయోజనం చూద్దాం. ఈ రచనకి పూనుకొన్నప్పుడు రచయిత ఆశించిన ప్రయోజనం ఏమిటి? సంపాదన వేటలో మనుషులు ఒత్తిళ్లకి లోనవుతున్నారనీ, అందువల్ల  పిల్లలు సమాజానికి దూరమైపోతున్నారనే. దీనికి విరుగుడుగా  రచయిత సూచించినది పిల్లల్ని కొంత ప్రజా  జీవితానికి దగ్గరగా పెంచాలని. కానీ  ఈ ప్రయోజనాన్ని ఈ కథ సాధించిందనీ, ఈ సందేశాన్ని  బలంగా వినిపించగలిగిందనీ చెప్పలేం. కథని “రసవత్తరంగా” చెప్పాలనే ఉత్సాహమూ, రహస్య ఆకాంక్షలూ కథ ప్రయోజనాన్ని సున్నా చుట్టేశాయి. డాక్టరుగారి ప్రవర్తన వర్ణనా, నైటీలూ, పెదవులూ, ఆకర్షణా, కిసుక్కుమని నవ్వడాలూ, తనలో తనే మురిసిపోవడాలూ, వగైరాలకీ కథ నడకకీ ఏమీ సంబంధం లేదు. “ఏదో” “ఏదో” జరగబోతోందన్న ఉత్కంఠని పాఠకుల్లో లేవనెత్తి కథని చదివించే ప్రయత్నం కథ ప్రయోజనానికి సరిపడదు. ఇదంతా కథని “రసవత్తరంగా”నడిపి చివరికి కథారచన రచయిత ప్రతిష్టలో భాగమైపోతుంది. సంపాదన వేటకి ఫలితం ఒత్తిళ్లు అని గుర్తించిన కధ ఆ సంపాదన వేటకి మూలాల్ని గుర్తించలేక పోయింది. ఉత్పత్తి విధానం పెట్టుబడిదారీ విధానం కావడంతో ప్రజల ఆరోగ్యం కూడా “సరుకు”గా మారి వ్యాపార సూత్రాలకు లోబడి పోటీ, లాభం అనే అంశాలు మానవ జీవితాలకు నిర్ణాయక శక్తులుగా వున్నాయనీ కథ స్పష్టం చెయ్యగలిగి వుంటే ఆశించిన ప్రయోజనం నెరవేరేది. శ్రామికుల జీతాల్నీ, పని గంటల్నీ పోటీ నిర్ణయిస్తుందన్న మార్క్స్ వాక్యం (Pre -Capital formation  అన్న నోట్సులో) ఒక్కటి చాలు కథని ప్రయోజనా పూర్వకంగా మలచడానికి. ఒక రచయిత తాను చూసిన విషయాన్ని కథగా రాసే ముందు చెయ్యవలసిన  అధ్యయనం ప్రాముఖ్యాన్నీ, ఆ అధ్యయనం లేకపోతే కలిగే అనర్ధాన్నీ చెప్పటానికే ఇదంతా రాసాను. మనం చూసిందే రాయాలంటే  సాహిత్యం అవసరం.  ప్రయోజనం పెద్దగా వుండదు. మనం చూసిన విషయాలు అందరూ చూస్తున్నారు. కొందరు రోజూ చూస్తున్నారు. సమస్య ఏంటంటే  చూస్తున్న దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఏం తెలుసుకోవాలి అనేదే.. ఆ సమస్యే సాహిత్య ప్రయోజనం. వాస్తవానికీ, వాస్తవికతకీ వున్న తేడా అదే. కనిపించింది చెప్పేవాడు వ్యాఖ్యాత. కనిపించనిది విప్పి చెప్పేవాడు రచయిత.

ఒక వ్యక్తి ఎక్కడ నిలబడ్డాడూ  అన్నది అతని దృక్పధమనీ, తన దృక్పధాన్ని పాఠకుల్తో పంచుకోవడం ద్వారా వాళ్లని ప్రభావితం చేసే ప్రయత్నమే సాహిత్య ప్రక్రియ అనీ మనం అంగీకరిస్తే ఒక రచన ప్రతిఫలించిన సంస్కారం ద్వారా రచయిత దృక్పధాన్ని నిర్ణయించవచ్చు. ఈ కథ చదివిన తర్వాత పాఠకుల్లో కలిగే భావాలేమిటి? రచయిత ఆశయము, ప్రయత్నమూ ఏదైనా కావొచ్చు కానీ పాఠకుల్లో డాక్టరుగారి పట్లా, పిల్లవాడి  పట్లా ఒక రకమైన సానుభూతి కలుగుతూంది. అయ్యో ఎన్ని కష్టాలు పడుతున్నదిరా అనిపిస్తుంది. అలాగే పిల్లవాడి పట్ల కూడా.. దీనిలోని అపసవ్యత గురించి పైన మనం మాట్లాడుకున్నాం.

ముత్తాత సంగీతంలోనూ, తాత మొక్కల్లోనూ “ఆనందం”పొందారని రాయడం పెత్తందారీ సమాజాలకి లేని మంచి తనాన్ని ఆపాదిస్తుంది. అప్పటి మంగళ్ల వాయిద్యాన్ని “సంగీతం”గా ఎవరూ గుర్తించలేదు. అది పొట్టకూటికి చేసే మరో విద్యే. సా.పా.సా అని సాగతీసి పాడే “శాస్త్రీయ” సంగీతకారులకి “మేళం”గా పిలవబడే మంగళ్లకు  దొరికే గౌరవం,స్థానం ఒకేలా, పోనీ కనీసం కుడి ఎడమలుగా వున్నాయా?

గ్రామంలో వైద్యం చేసి పొట్ట పోసుకున్న తాత, నిచ్చెన మెట్ల  సమాజంలో పై మెట్టుకి ఎగబాకే ప్రయత్నమే చేశాడు గానీ, ప్రజల జీవితంలోని హెచ్చుతగ్గుల్ని సరిచేసే సంస్కారం ఏమీ ప్రయత్నించలేదు. “ముందుగా మీ వాడిలో ఏమైనా వుందేమో చూడండి” అన్న కథకుడు గానీ, తన తాత తండ్రుల సంగీత సాధనని వైనవైనాలుగా వర్ణించిన డాక్టరుగారు గానీ సంగీతం, విద్య వగైరా అనువంశికాలనీ, దైవదత్తాలనీ, పూర్వజన్మ సుకృతాలనీ ప్రచారం చేసే బ్రాహ్మణీయ భావజాలానికి భిన్నంగా ఆలోచించలేదు.

గతంలో  ప్రజలు విశ్రాంతిగా, కళాత్మకంగా జీవించేరు, ఆనందించేరు. ఇప్పటి స్పీడు( ఉసూరుమనిపిస్తుందండీ) దాన్ని దూరం చేసిందన్న భావం ఎవరికైనా కలిగే అవకాశం వున్నది. అది మనల్ని వ్యక్తిగతంలోకి, భూస్వామ్య,  పెత్తందారీ సంస్కృతి (దేవరా!) వైపూ, ఆ శిధిల సమాజం వైపూ ఆశగా చూసేటట్టు చేస్తే ఆ తప్పెవరిది?

కథ చెప్పిన విధానాన్ని చూస్తే శిల్పంగా పిలవబడేది స్థిరము కాదు. జఢము కాదు. తీరుబాటు సమాజంలో సాహిత్యానికి వర్తించే సూత్రాలు ప్రతి క్షణమూ  పెట్టుబడికి యంత్రభూతముల కోరలు తోమే సమాజంలో ఎంత మాత్రమూ నప్పవు. సమయం తక్కువైన సమాజంలో డాక్టరుగారి జీవితం నుంచి చూసినా సరే, ఏ విషయమైనా క్లుప్తంగా చెప్పడం తప్పనిసరి అవుతుంది. నలభై పేజీల కథ ఆ మేరకి ఏం సాధిస్తుందన్నది ప్రశ్నార్ధకమే. నాలుగు తరాల జీవిత చరిత్ర వివరంగా విస్తరించుకొన్నప్పటికీ  పాఠకుడికి కొత్తగా అందిన తెలివిడి ఏమీ వుండదు. చిన్న కథలో రాయబడ్డ ప్రతీ వాక్యమూ మరో వాక్యానికీ, మరీ ముఖ్యంగా కథాంశంగా పిలవబడే ప్రధాన విషయానికి పెనవేసుకుని పొవాలి. కేంద్రాన్ని బలపరిచేదిగా వుండాలి. కథలో ఈ అంశం ఎంత మాత్రమూ కనబడదు. ప్రజల(జీవితం)తో సంబంధం పోగొట్టుకున్న మనవడి ముత్తాతకీ, తాతకీ  ప్రజలతో సంబంధం లేదా? తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత సంబంధం తోటే వున్నారే! మరి ఆ జీవితాలన్నీ అంత వివరంగా ప్రస్తావించడం ఎందుకు? అదేం కాదు. ముత్తాత సంగీతము, తాత మొక్కల పెంపకం ఇలా కేవలం విశ్రాంతి అనేదే ప్రధాన విషయం. అంటే కథ నేలమీద కాకుండా పూర్తిగా గాలిలో పుట్టినట్టే. ఫ్యూడల్ సంస్కృతిలోముత్తాత, పెత్తందారీ సంస్కృతిలో  తాత ఎంతో విశ్రాంతిగా బతికారనుకోవడం, కలలూ, ఆనందాలూ ఆస్వాదించారనీ రాయడం వాస్తవానికి ఎంత దగ్గరగా వున్నది? పైగా కథకి  అక్షరాలుగా చెప్పబడే ఏకసూత్రత, అనుభూతి ఐక్యత ఎలా సాధించినట్టు?  చదువుతున్నంత సేపూ పరస్పర విరుద్ధ భావాల్ని కలుగచేసే కథ శిల్పం పరంగా  వుత్తమంగా వుందని అనలేం.

సంభాషణల రూపంలోనూ, మారే దృశ్యాలతోనూ, పరిపుష్టమైన పాత్రలతోనూ నడిచే కథ కళాత్మకతను సంతరించుకుంటుంది. డాక్టరుగారి అంతులేని వుపన్యాసంతోనూ, రకరకాలుగా ప్రవర్తించే  పాత్రలతోనూ సాగిన కథ కళావిలువలుగా పిలువబడే సౌష్టవానికి చాలా దూరంలోనే వుండిపోయింది.

పాత్రల చిత్రణ, కథా సంవిధానం, నాటకీయత వగైరా ఎన్నో విషయాలు గురించి మరోసారి ఎప్పుడైనా మాట్లాడదాం.

Download PDF

4 Comments

Leave a Reply to sarada Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)