కోతలన్నీ కప్పి ఉంచే గవురవం
విత్తనాల పండగ మొలకలన్నీ
మొటిమలై మాడిన నేల మొకం
కబురుల కీటకాల రొదన
భూమీ ఆకాశాలు లాగి తన్తే
మళ్ళీ నీ నీ జ్ఞాపకాల చూపు
రెప్పల పొరల కోతకి కన్నీళ్ళ వణుకు
లోకమంతా పోయినాక ఎముకల
కోలాటం మోత బందాలు
ప్రమాణాల ముళ్ళకంచ కొక్కానికి
ఉగుతున్న గుండె దేగేసిన ముళ్ళ లో
స్వరం స్పర్శా వాతాన పడి
ఒకటి పక్కన ఎన్ని సున్నా లలో
శరీరం మట్టి మట్టి శరీరం
చీల్చే సాయ వ్యవసాయాలు
తిరిగి కౌగిలి దున్నె తలపులు
కోరికని కడుపులో కుక్కుకుని
నన్ను నరికే కత్తి నా వెన్నుపూస
గాలి లో అడతన్న మాసపు కండల రుచీ రంగూ
వేట సింహం దగ్గరకు లక్కుని వాసన చూసి
ఇష్టంగా త్రుప్తి గా తింటా పోగేసిన
సమాది పునాది ఎముకలు
మూసిన కళ్ళ తో గాయపు
పేడు తడిమి పురుగు పట్టిన
పున్దుని ఎండలో పెట్టీ కదలికలు
కనపడి నిన్న పడిన వాన ఉమ్మి ,
మల్లెల జల్లుగా రక్తపు మట్టీ
కాసిని వాసన లేని కనకాంబరాలు
జల్లి oచుకునే కళే బర యాత్ర ని
( రైతుబజారు హక్కుల కోసం పోరాడే తమ్ముడు కర్రి రవీంద్ర సాయి ని, నమ్మిన స్నేహితులే ఎండ్రిన్ తాగించి చంపేసిన దుర్ఘటన మనసు ని కోసేస్తున్నప్పుడు రాసిన కవిత )
-మన్నం సింధు మాధురి
దేవుడా!
విత్తనాల పండగ మొలకలన్నీ
మొటిమలై మాడిన నేల మొకం//
సాయ వ్యవసాయాలు….బాధని ఒడిసి పట్టే పదాలు కవిత నిండా… అంతులేని దుఖానికి, హృదయపు నొప్పికి ఎన్ని మాటలైనా చాలవు… కవిత నిండా గాయాలే మాధురి గారు… నమ్మినవాడినే నిలువునా నరికే అమానుషత్వం… ఎన్ని పదాల్లో ఇమిడ్చినా తరగదు..
రైతుల్ది శరీరంగాదు అది వూపిరి ఆడ్తావుండే శవము.
కష్టాల కత్తులు పొడిస్తే మోళ్లై ఒంగిన ఎముకల గూళ్లు వాళ్లు.
వాళ్ల బతుకుల నిండా గుండు సున్నాల బండలు. బాగా చెప్పవమ్మా మాధురీ.