అధికారాన్ని ప్రశ్నించడం. బలవంతున్ని ఎదుర్కోవడం. ఉనికిని కాపాడుకోవడానికి కష్టించడం.అస్తిత్వం కోసం పోరాడటం. ఇవే మన విప్లవాలు. విజయాలు సాధించడం ఎప్పుడో తెలీదుగానీ, అనునిత్యం పోరాడటమే మన అస్తిత్వ వాదం. ఈ బాటలో పశువులూ, పక్షులూ, ప్రకృతీ కనీసం సహానుభూతైనా చూపిస్తాయేమోగానీ…సాటి మనిషే ఎందుకో చాలావరకూ అటువైపే ప్రత్యర్థిలా మిగిలిపోతున్నాడు. ఈ సత్యాన్ని చర్నాకోలుతో చరిచి చెప్పిన కథ వేంపల్లి షరీఫ్ “తగులు”.
కథమొత్తం ఉగ్గబట్టుకుని చదివాక, చివరి ఒక్క వాక్యంలో తను ఇమిడ్చిన కొన్ని వేల తరాల పోరాటస్ఫూర్తికి నేను దాసోహం అన్నాను. కళాకారుడిగా షరీఫ్ వేంపల్లి కి జైబోలో అన్నాను. కథరాసినందుకు అభినందనలు. నాచేత చదివించినందుకు కృతఙ్జతలు.
-కత్తి మహేష్