నాలో నేనున్నాను.. నీవున్నావు
నేను మనమైయున్నాము-
* * *
జరిగిందేదో జరిగిపోయింది-
అలాని అది చిన్న నేరమనికాదుకానీ..
జరగాల్సినదెంతో ఉన్నందున కాసేపు దాన్ని విస్మరిద్దాం
సాకారమైన కలకు కొత్త నిర్మాణాలు నేర్పుదాం
* * *
సరే, ఎటులైతేనేమి, భీష్మ,ద్రోణ, విదుర, అశ్వత్థామలు ఓడిరి
ధర్మము నాలుగు పాదాలా నడయాడిననాడే..
‘కుంజరః’అని ధర్మజుడు కూసేయగలిగినాడు
కలియుగమ్మున-అందునా రాజకీయమ్మున..
ధర్మాధర్మ విచక్షణ తగునే విజ్నులకు?
వాలిని చంపిన రాముడు; కోకలు దోచి, కుత్తుకలు కోయించిన క్రిష్ణుడు
చేసినది లోక కల్యాణమేగాన..
ఇప్పుడు జరిగినది వేరేమి?
* * *
ఇన్నాళ్లూ, వేలు మనది కన్ను వారిది
ఇప్పుడు కన్నూవారిదే, వేలునూ వారిదే
కాటుకలే దిద్దుకుందురో, కలికములే పెట్టుకుందురో-
అది కన్నూ వేలూ సొంతమైనవారి సొంతయవ్వారంగందా!
ఫాల నేత్రం తెరుచుకుందిప్పుడే..
కన్ను కొత్తగా ఎరుపెక్కినప్పుడు బిగిసినవారి పిడికిలిలో..
మన వేలుకు ఎప్పుడూ చోటుంటుంది కదా!
* * *
నాలో నీవున్నాను.. నీలో నేనున్నాను..
మనమే, నీవు.. నేనైనాం!
-దేశరాజు
ప్రయత్నం బాగుందికానీ భారతంలోని అంశాలని అసమగ్ర వంకర బుద్ధితో ఉటంకించడమే బాగులేదు.
చాలా బాగుంది. ఇపుడిక జరగాల్సింది చరిత్ర నిర్మాణం.