*
ముగ్గులు స్త్రీల కళా నైపుణ్యానికి, కల్పనాశక్తికి చిహ్నాలు. కేవలం హస్తమాత్ర సహాయంతో ఊహాశక్తిని అనుసరించి చిత్ర విచిత్రాలైన రచనా విధానాలతో సంప్రదాయాలను ప్రదర్శించే స్త్రీల ముగ్గులు చిత్రకళాధి దేవతకు సహజ సౌందర్య శోభిత ఆభరణాలు. ‘దృశ్యాదృశ్యం’ పేరిట సారంగ పాఠకులకు పరిచయం అయిన కందుకూరి రమేష్ బాబు సంక్రాంతి సందర్భంగా ప్రదర్శిస్తున్న చిత్రకళా ప్రదర్శన వీటిపైనే. శుభాకాంక్షలతో…ఆహ్వానం అందరికీ….
సంక్రాంతి శుభాకాంక్షలతో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ
భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి సౌజన్యంతో
చిత్రలిపి
SAMANYASHASTRAM IMAGES
~ కందుకూరి రమేష్ బాబు ఛాయాచిత్ర ప్రదర్శన ~
11 జనవరి 2014 సాయంత్రం 6 గం॥
ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో, కళాభవన్, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్-4
ప్రదర్శనః 12 నుంచి 14 జనవరి 2014 వరకు. ప్రతి రోజూ ఉదయం 11 గం॥ సాయంత్రం 7 గం॥ వరకు
జ్యోతి ప్రకాశనం
శ్రీమతి సత్యలతా కిషన్ (చిత్రకారుడి మాతృమూర్తి)
ప్రారంభకులు
శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు, ఐఎఎస్ (కార్యదర్శి, ఆం.ప్ర. భాషా సాంస్కృతిక శాఖ)
ముఖ్య అతిథి
శ్రీ బి.నరసింగరావు (ప్రసిద్ధ దర్శకులు, ఛాయా చిత్రకారులు)
విశిష్ట అతిథి
శ్రీ అల్లం నారాయణ ( సంపాదకులు, నమస్తే తెలంగాణ దిన పత్రిక)
ఆత్మీయ అతిథి
డా॥ రాళ్లబండి కవితా ప్రసాద్ ( సంచాలకులు, ఆం.ప్ర. భాషా సాంస్కృతిక శాఖ)
ముగింపు ఉత్సవం
14 జనవరి 2014. సాయంత్రం 6గం॥
ఆత్మీయ అతిథులు: డా॥ రావి ప్రేమలత (‘చిత్రలిపి’ పరిశోధకులు),
శ్రీ కె.వి.రమణా చారి (సాంస్కతిక శాఖ పూర్వ సలహాదారులు)
అందరికీ సాదర ఆహ్వానం
ప్రతిభాశీలి చిరంజీవి రమేష్ .’చిత్ర ప్రదర్శన’ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ,
మౌళి,వరంగల్